IPS Officers: ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు
ABN , First Publish Date - 2022-12-31T11:46:39+05:30 IST
ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి.
అమరావతి: ఏపీలో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. పి.వి.సునీల్కుమార్ సహా 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారులకు డీజీపీ ర్యాంకులు వచ్చాయి. మహేష్దీక్షిత్, అమిత్గార్గ్, పి.వి.సునీల్కుమార్లకు డీజీపీ ర్యాంకులు ఖరారయ్యాయి. డీజీపీ ర్యాంకులో పి.వి.సునీల్కుమార్ సీఐడీ చీఫ్గా పనిచేయనున్నారు. మహేష్దీక్షిత్, అమిత్గార్గ్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం డిప్యుటేషన్లో ఉన్న విషయం తెలిసిందే.