డీఈవో ఖాతాలో రూ. 4.9 లక్షలు గల్లంతు!

ABN , First Publish Date - 2022-11-30T01:16:46+05:30 IST

కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా బ్యాంకు ఖాతా నుంచి రూ. 4 లక్షల 90 వేలు సైబర్‌ నేరగాళ్లు డ్రా చేశారు. స్టేట్‌ బ్యాంకు ఖాతా నుంచి సైబర్‌ నేరస్తులు సొమ్మును డ్రా చేశారు. డీఈవో తాహెరా సుల్తానా ఫిర్యాదు మేరకు మంగళవారం చిలకలపూడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

డీఈవో ఖాతాలో రూ. 4.9 లక్షలు గల్లంతు!

మచిలీపట్నం టౌన్‌ : కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా బ్యాంకు ఖాతా నుంచి రూ. 4 లక్షల 90 వేలు సైబర్‌ నేరగాళ్లు డ్రా చేశారు. స్టేట్‌ బ్యాంకు ఖాతా నుంచి సైబర్‌ నేరస్తులు సొమ్మును డ్రా చేశారు. డీఈవో తాహెరా సుల్తానా ఫిర్యాదు మేరకు మంగళవారం చిలకలపూడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సీఐ కొండయ్య మాట్లాడుతూ, కేసును సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేస్తున్నామన్నారు. జిల్లా అధికారి ఖాతా నుంచి నగదు డ్రా చేయడం మచిలీపట్నంలో సంచలనం రేకెత్తించింది. జిల్లా ఎస్పీ జాషువా కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించారు.

Updated Date - 2022-11-30T01:16:48+05:30 IST