AP News: ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌పై సమీక్ష నిర్వహించిన హోంమంత్రి

ABN , First Publish Date - 2022-11-02T15:07:42+05:30 IST

అమరావతి: ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌పై హోంమంత్రి తానేటి వనిత సమీక్షా సమావేశం నిర్వహించారు.

AP News: ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌పై సమీక్ష నిర్వహించిన హోంమంత్రి

అమరావతి: ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌పై హోంమంత్రి తానేటి వనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయం 2వ బ్లాక్‌లో ఎస్పీఎఫ్ ఉన్నతాధికారులతో ఆమె సమావేశమయ్యారు. ప్రభుత్వరంగ సంస్థల్లో ఎస్పీఎఫ్ తీసుకుంటున్న చర్యలు, దేవాలయాల్లో భద్రత, సీసీ కెమెరాల నిఘా వంటి అంశాలపై హోంమంత్రి చర్చించారు. ఎస్పీఎఫ్ సిబ్బందికి సంబంధించిన సమస్యలు, సవాళ్ళను, ప్రొమోషన్స్, ఇతర అంశాలపై తానేటి వనిత చర్చించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా, స్పెషల్ సెక్రటరీ విజయ్ కుమార్, ఎస్పీఎఫ్ డీజీ సంతోష్ మెహ్రా, ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో ఎస్పీఎఫ్ పోలీసుల పని తీరు గురించి డీజీ సంతోష్ మెహ్రా వివరించారు.

Updated Date - 2022-11-02T15:07:48+05:30 IST