Casino Episode: గుడివాడ క్యాసినో వ్యవహారంపై ఆధారాలను ఐటీకి అందజేసిన టీడీపీ
ABN , First Publish Date - 2022-12-19T16:12:13+05:30 IST
విజయవాడ: గుడివాడ క్యాసినో వ్యవహారం (Gudivada Casino Episode) మరోసారి తెరపైకి వచ్చింది.
విజయవాడ: గుడివాడ క్యాసినో వ్యవహారం (Gudivada Casino Episode) మరోసారి తెరపైకి వచ్చింది. టీడీపీ నేతలు వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు రావి వెంకటేశ్వర రావు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, బోండా ఉమ తదితరులు సోమవారం విజయవాడలోని ఐటీ కార్యాలయానికి వెళ్ళారు. గుడివాడ క్యాసినో నిర్వాహణ, ఎంత మొత్తం చేతులు మారాయనే దానిపై తమ వద్దనున్న వివరాలను ఐటీ అధికారులు వివరించారు. ఈ క్యాసినోలో వల్లభనేని వంశీ, కొడాలి నాని ప్రధాన సూత్రదారులని వెల్లడించారు.
క్యాసినో నిర్వాహాకుడు చికోటి ప్రవీణ్ తనకు స్నేహితుడన్న వల్లభనేని వంశీ కామెంట్లు, వీడియో క్లిప్పింగులను టీడీపీ నేతలు ఐటీ అధికారులకు అందజేశారు. క్యాసినో నిర్వహణ కోసం గోవా నుంచి కొంత మంది మహిళలను ఫ్లైట్లల్లో తీసుకొచ్చారన్న వివరాలను సయితం అందజేశారు. గుడివాడ క్యాసినో ఎంట్రీ టిక్కెట్టే రూ. 10 వేలు పెట్టారని వివరించారు. సుమారు రూ. 500 కోట్ల మేర లావాదేవీలు జరిగాయని, హవాలా ద్వారా ఆ మొత్తాన్ని దారి మళ్లించి ఉండొచ్చని ఐటీకి టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. హవాల సొమ్మును దారి మళ్లించేందుకు చికోటీ సాయపడ్డారని ఐటీకి టీడీపీ నేతలు వివరించారు.