దోమల నివారణకు ఫ్రైడే డ్రై డేగా పాటించాలి

ABN , First Publish Date - 2022-08-25T06:30:29+05:30 IST

దోమల నివారణకు ప్రతి ఒక్కరు ఫ్రైడే డ్రై డేగా పాటించాలని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మిలు అన్నారు.

దోమల నివారణకు ఫ్రైడే డ్రై డేగా పాటించాలి
ర్యాలీని ప్రారంభిస్తున్న మేయర్‌ భాగ్యలక్ష్మి , పక్కన ఎమ్మెల్యే, కమిషనర్‌

దోమల నివారణకు ఫ్రైడే డ్రై డేగా పాటించాలి

ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి

చిట్టినగర్‌, ఆగస్టు 24: దోమల నివారణకు ప్రతి ఒక్కరు ఫ్రైడే డ్రై డేగా పాటించాలని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మిలు అన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, సీజనల్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సర్కిల్‌-1 పరిధిలోని కొత్తపేట నెహ్రూబొమ్మ సెంటర్‌ నుంచి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ ప్రారంభించారు. దోమల నివారణకు నగరపాలక సంస్థ చేపడుతున్న యాంటీలార్వా ఆపరేషన్‌లు, దోమల పెరుగుదలకు గల కారణాలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ  ప్రజలు తమ చుట్టూ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.  ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు. చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పి.రత్నావళి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుహాసిని, బయాలజిస్ట్‌ బాబు శ్రీనివాసన్‌, అధికారులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-25T06:30:29+05:30 IST