కౌలు రైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-01-21T06:34:20+05:30 IST
నందిగామ మండలం గోళ్లమూడికి చెందిన కౌలు రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నందిగామరూరల్, జనవరి 20 : నందిగామ మండలం గోళ్లమూడికి చెందిన కౌలు రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కటారపు కృష్ణ (34) రెండేళ్లుగా కౌలుకు వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది కూడా తొమ్మిది ఎకరాల్లో పత్తి, మిర్చి పంటలు సాగు చేశాడు. పంటలు దెబ్బతినడంతో అప్పు తీర్చే మార్గం లేక గురువారం ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని మరణించాడు. రెండేళ్లుగా పంట నష్టం రావడంతో పది లక్షల వరకూ అప్పులయ్యాయి. మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని సీపీఎం నాయకులు చనుమోలు సైదులు, కటారపు గోపాల్, జడ్పీటీసీ సభ్యుడు గాదెల బాబు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు.