రేపు డీఈవో కార్యాలయం ముట్టడి : ఫ్యాప్టో
ABN , First Publish Date - 2022-07-07T06:16:54+05:30 IST
జీవో 117 రద్దు చేయాలని కోరుతూ ఈనెల 8వ తేదీన జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ముట్టడించేందుకు ఫ్యాప్టో నేతలు పిలుపునిచ్చారు.
మచిలీపట్నం టౌన్, జూలై 6 : జీవో 117 రద్దు చేయాలని కోరుతూ ఈనెల 8వ తేదీన జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ముట్టడించేందుకు ఫ్యాప్టో నేతలు పిలుపునిచ్చారు. మచిలీపట్నం యూటీఎఫ్ భవనంలో బుధవారం జరిగిన సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా నేతలు బి.లంకేష్ అధ్యక్షత వహించి ప్రసంగించారు. విద్యారంగానికి చేటు చేసే 177 జీవోను రద్దు చేయాలని, క్షేత్ర స్థాయిలో ఉపాధ్యాయ సంఘాల నాయకులే కాకుండా ఉపాధ్యాయులు, విద్యార్థుల తలిదండ్రులు కోరుతున్నారన్నారు. 117 జీవో వల్ల కొన్ని పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. తరగతుల విలీనాన్ని ఆపేయాలని, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర నాయకులు ఎం.బాబూరాజేంద్ర ప్రసాద్, బి.అశోక్కుమార్, యూటీఎఫ్ నేతలు జె.లెనిన్బాబు, ఎ.సుందరయ్య, ఏపీటీఎఫ్ నేతలు ఈవీ రామారావు, బీటీఏ నాయకులు చంద్రశేఖర్, కొల్లు సురేష్, ఏపీపీటీఏ నాయకులు డిమాండ్ చేశారు.