స్టెల్లా కళాశాలలో శాంతి ర్యాలీ
ABN , First Publish Date - 2022-03-05T06:13:12+05:30 IST
కళాశాలలోని ఎకో అంబాసిడర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం శాంతి ర్యాలీ నిర్వహించారు.ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు శుభప్రదం కాదని, భావితరాలకు శాంతి సందేశం అందించి, అన్ని దేశాల మధ్య శాంతి సౌభ్రాతృత్వం నెలకొనే విధంగా ప్రతి ఒక్కరూ కాంక్షించాలని, యుద్ధం ప్రపంచంలో మనుగడ లేకుండా చేస్తుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ జసింతా క్వాడ్రస్ తెలిపారు.
స్టెల్లా కళాశాలలో శాంతి ర్యాలీ
రామలింగేశ్వరనగర్, మార్చి 4 : కళాశాలలోని ఎకో అంబాసిడర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం శాంతి ర్యాలీ నిర్వహించారు.ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు శుభప్రదం కాదని, భావితరాలకు శాంతి సందేశం అందించి, అన్ని దేశాల మధ్య శాంతి సౌభ్రాతృత్వం నెలకొనే విధంగా ప్రతి ఒక్కరూ కాంక్షించాలని, యుద్ధం ప్రపంచంలో మనుగడ లేకుండా చేస్తుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ జసింతా క్వాడ్రస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ స్లీవా, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఇన్నాసియా, అనూహ్య, డాక్టర్ లిటల్ ఫ్లవర్, ఇంటర్ వైస్ ప్రిన్సిపాల్ స్వప్న ఎన్సీసీ ఆఫీసర్ ఎల్.టి.శైలజ, సిస్టర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు. ‘సే నో టూ వార్ - పీస్ టూ వరల్డ్’ అంటూ యుద్ధం కాదు పరిష్కారం అనే కార్డ్స్తో ర్యాలీగా విద్యార్థినులు వెళ్లారు.