ఆధార్‌తో ఓటర్‌ కార్డు అనుసంధానానికి సహకరించాలి

ABN , First Publish Date - 2022-10-07T05:55:42+05:30 IST

ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధాన కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని ఆర్డీవో ప్రసన్నలక్ష్మి కోరారు.

ఆధార్‌తో ఓటర్‌ కార్డు అనుసంధానానికి సహకరించాలి
రాజకీయపార్టీల నాయకులతో ఆర్డీవో సమీక్ష

రాజకీయ పార్టీల నాయకులతో ఆర్డీవో ప్రసన్నలక్ష్మి సమీక్ష

తిరువూరు, అక్టోబరు 6: ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధాన కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని ఆర్డీవో ప్రసన్నలక్ష్మి కోరారు.  రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో గురువారం  అఖిలపక్ష నాయకులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గం పరిధిలో 73 శాతం ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం పూర్తి  అయిందని, మిగిలిన 27 శాతం పూర్తి చేసేందుకు సహకరించాలన్నారు. పోలింగ్‌ స్టేషన్లకు సంబంధించి 1400 ఓటర్లు పైబడి ఉంటే మరో పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. నవంబరు 9 నుంచి డిసెంబరు 8 వరకు ఓటర్ల జాబితాలో చేర్పులు తొలగింపులకు దరఖాస్తులు తీసుకుంటారని, 2023 జనవరి 5న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామన్నారు. సమావేశంలో తిరువూరు, గంపలగూడెం, విస్సన్నపేట, ఎ.కొండూరు,  తహసీల్దార్‌లు ఎన్‌.సురేష్‌బాబు, జి.బాలకృష్ణారెడ్డి, కె.లక్ష్మి, వెంకటేశ్వర్లు,  వివిధపార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-07T05:55:42+05:30 IST