జ్యోశ్రిత భవానికి అభినందన

ABN , First Publish Date - 2022-12-07T00:34:23+05:30 IST

అంతర్జాతీయ ఓపెన్‌ కరాటే చాంపియన్‌షిప్‌లో తమ కళాశాల విద్యార్థిని ఎం.జ్యోశ్రిత భవాని బంగారు పతకం సాధించినట్లు సిద్ధార్థ మహిళా కళాశాల డైరెక్టర్‌ టి.విజయలక్ష్మి తెలిపారు.

జ్యోశ్రిత భవానికి అభినందన

జ్యోశ్రిత భవానికి అభినందన

లబ్బీపేట, డిసెంబరు6: అంతర్జాతీయ ఓపెన్‌ కరాటే చాంపియన్‌షిప్‌లో తమ కళాశాల విద్యార్థిని ఎం.జ్యోశ్రిత భవాని బంగారు పతకం సాధించినట్లు సిద్ధార్థ మహిళా కళాశాల డైరెక్టర్‌ టి.విజయలక్ష్మి తెలిపారు. కరాటే పోటీలలో సీఎం కప్‌ విభాగంలో టీమ్‌ కరాటేలో గ్రీన్‌ బెల్ట్‌, గోల్డ్‌ మెడల్‌, వ్యక్తిగత విభాగంలో కూడా గ్రీన్‌ బెల్ట్‌, గోల్డ్‌ మెడల్‌ను పొంది రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించిందని తెలిపారు. గుంటూరులో ఈ నెల 4న జరిగిన అంతర్జాతీయ ప్రపంచ కరాటే పోటీల్లో జ్యోశ్రిత బంగారు పతకం సాధించి చాంపియన్‌షిప్‌ పొందిందని తెలిపారు. ఈ సందర్భంగా భవానిని కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్‌ ఎస్‌.కల్పన, పి.డి కనకదుర్గ అభినందించారు.

Updated Date - 2022-12-07T00:34:27+05:30 IST