ముస్లింలకు సీఎం తీరని అన్యాయం
ABN , First Publish Date - 2022-06-30T06:28:52+05:30 IST
దుల్హన్ పథకాన్ని రద్దు చేసి సీఎం జగన్ ముస్లింలకు తీవ్ర అన్యాయం చేశారని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విమర్శించారు.
మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ, జూన్ 29: దుల్హన్ పథకాన్ని రద్దు చేసి సీఎం జగన్ ముస్లింలకు తీవ్ర అన్యాయం చేశారని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విమర్శించారు. బుధవారం టీడీపీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈసందర్భంగా సౌమ్య మాట్లాడుతూ, ముస్లిం మైనార్టీకు ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి, అధికారుంలోకి వచ్చిన తరువాత ఒక్క హామీ అమలు చేయకుండా అన్యాయం చేశారన్నారు. విదేశీ విద్యతో పాటు మక్కా యాత్రలు కూడా నిలిపివేశారని ఆరోపించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆర్డీవో రవీంద్రరావుకు వినతి పత్రం అందజేశారు.