శుభం కార్డు పడుతుంది.. జగన్తో భేటీపై చిరు రియాక్షన్
ABN , First Publish Date - 2022-02-10T16:27:42+05:30 IST
చిరంజీవి బృందం గురువారం సీఎం జగన్తో భేటీ కానుంది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో...
హైదరాబాద్: చిరంజీవి బృందం గురువారం సీఎం జగన్తో భేటీ కానుంది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రితో చిరంజీవి, మహేష్బాబు, ప్రభాస్ పలువురు నిర్మాతలు సమావేశం కానున్నారు. ఈ భేటీ తర్వాత టిక్కెట్ల ధరలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేక విమానంలో సినీ ప్రముఖులు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లనున్నారు.
ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయంకు చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ ఖచ్చితంగా శుభం కార్డు పడుతుందని అన్నారు. తాము మాట్లాడాలని అనుకున్నది, చెప్పాలనుకున్నదంతా విపులంగా ముఖ్యమంత్రికి వివరిస్తామని చిరంజీవి చెప్పారు. భేటీ ముగిసిన అనంతరం బయటకు వచ్చి మీడియా సమావేశంలో అన్ని విషయాలు వివరిస్తామని తెలిపారు.
కాగా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి సీఎం జగన్తో సినీ ప్రముఖుల భేటీ కానున్నారు. సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై చర్చలు జరపనున్నారు. చిరంజీవి వెంట ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్బాబు.. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్ర నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. టికెట్ల ధరల పెంపుపై ఇప్పటికే ప్రభుత్వానికి అధ్యయన కమిటీ నివేదిక ఇచ్చింది. కమిటీ ప్రతిపాదనలపై సినీ ప్రముఖులతో చర్చించి సీఎం జగన్ తుది నిర్ణయం తెలపనున్నారు.