బై బై.. బైక్ రైడ్
ABN , First Publish Date - 2022-11-03T00:28:02+05:30 IST
స్వాత్రంత్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, కేంద్ర ప్రభుత్వ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా 75 మందితో ఢిల్లీలో బయల్దేరిన బైక్ ర్యాలీ బుధవారం నగరానికి చేరుకుంది.
విజయవాడ, ఆంధ్రజ్యోతి : స్వాత్రంత్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, కేంద్ర ప్రభుత్వ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా 75 మందితో ఢిల్లీలో బయల్దేరిన బైక్ ర్యాలీ బుధవారం నగరానికి చేరుకుంది. బాపు మ్యూజియం వద్ద కలెక్టర్ దిల్లీరావు వారికి ఘనంగా స్వాగతం పలికారు. యూత్ ఎఫైర్స్, స్పోర్ట్స్, కల్చర్, టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 75 ప్రధాన నగరాలను కలుపుకొంటూ 21 వేల కిలోమీటర్ల వరకూ ఈ బైక్ యాత్ర సాగుతుంది.