శ్మశానవాటిక స్థలంలో నిర్మాణాలపండి

ABN , First Publish Date - 2022-12-31T00:41:44+05:30 IST

పెద్దవరంలో ఎస్సీ, బీసీలు వినియోగిస్తున్న శ్మశానవాటిక స్థలంలో గోడౌను నిర్మాణం చేపడుతున్నారని, దానిని ఆపాలని గ్రామస్థులు శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు.

శ్మశానవాటిక స్థలంలో నిర్మాణాలపండి
తహసీల్దార్‌కు పెద్దవరం గ్రామస్థుల వినతి

తిరువూరు, డిసెంబరు 30: పెద్దవరంలో ఎస్సీ, బీసీలు వినియోగిస్తున్న శ్మశానవాటిక స్థలంలో గోడౌను నిర్మాణం చేపడుతున్నారని, దానిని ఆపాలని గ్రామస్థులు శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ, ప్రభుత్వ భూమి సుమారు ఎకరాన్ని గతంలో శ్మశానవాటికగా అభివృద్ధి చేసుకున్నాం. అన్ని వర్గాల వారు ఈ స్థలాన్ని శ్మశానవాటికగా వినియోగిస్తుంటే, గ్రామస్థుల అంగీకారం లేకుండా స్థలంలో గోడౌను నిర్మాణ పనులు చేపటట్టంపై ఆగ్రహ ం వ్యక్తంచేస్తున్నారు. గోడౌన్‌ నిర్మాణాన్ని ఆపకుండా భవిష్యత్తులో దహన సంస్కారాలకు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తక్షణం పనులు నిలుపుదల చేయాలని తహసీల్దార్‌ నూతక్కి సురేష్‌బాబుకు వినతిపత్రాన్ని అందించారు. స్పందించిన ఆయన పరిశీలించి తగు చర్యల తీసుకుంటానని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో వనమాలి, వరహాలరావు,బాలు, కృష్ణ, పెద్దనాగరాజు, కొప్పాల వీరాస్వామి, చిలుకూరి చిన్నకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:41:45+05:30 IST