రామలింగేశ్వరుడిని తాకిన భానుడి కిరణాలు...
ABN , First Publish Date - 2022-09-19T05:49:30+05:30 IST
పట్టణంలో వేంచేసియున్న సుకశ్యామలాంబ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భానుడి కిరణాలను స్వామిని తాకాయి.
నందిగామ రూరల్, సెప్టెంబరు 18: పట్టణంలో వేంచేసియున్న సుకశ్యామలాంబ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భానుడి కిరణాలను స్వామిని తాకాయి. ఆలయంలో ప్రభాత దర్శనానికి వచ్చిన భక్తులు ఈ దృశ్యాన్ని చూసి పరవశించారు. ఆలయం శివనామస్మరణతో మార్మోగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.