పేదలకు అండగా టీడీపీ

ABN , First Publish Date - 2022-12-07T00:47:47+05:30 IST

పేదలకు అండగా టీడీపీ ఉంటుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌మీరా అన్నారు.

పేదలకు అండగా టీడీపీ

వన్‌టౌన్‌, డిసెంబరు 6 : పేదలకు అండగా టీడీపీ ఉంటుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌మీరా అన్నారు. మంగళవారం కేశినేని శివనాథ్‌ (చిన్ని) సౌజన్యంతో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌చార్జి బుద్దా వెంకన్న, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, బీసీ మైనార్టీ నేత నాగుల్‌మీరా ఆధ్వర్యంలో కేశినేని ఫౌండేషన్‌ నడుపుతున్న మొబైల్‌ అన్నక్యాంటీన్‌ 37వ డివిజన్‌ పరిధి వన్‌టౌన్‌ గద్దబొమ్మ సెంటర్‌ వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హాజరైన నాగుల్‌మీరా పేదలకు అన్నవితరణ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎన్టీఆర్‌ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికే టీడీపీని స్థాపించారన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందాయఆ్నరు. పేదలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక వాటిని తొలగించి పేదల కడుపు కొట్టారన్నారు. పార్టీ నేతలు కె.రవీంద్ర, ఎస్‌ఏడుకొండలు, కె.హనుమంతరావు, కామదేవరాజ్‌, గణపారాము, టి.రమణమ్మ, కె.శారద పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:47:48+05:30 IST