కారు ఢీకొని యువకుడి మృతి

ABN , First Publish Date - 2022-11-24T00:47:06+05:30 IST

జయవాడ -మచిలీపట్నం రహదారిపై మం టాడ చెక్‌పోస్టు సమీపాన రోడ్డు దాటుతున్న యువకుడిని కారు ఢీకొంది. దీంతో యువకుడు అక్కడికక్కడే మరణించాడు. పమిడిముక్కల మండలం అగినపర్రు గ్రా మానికి చెందిన చిన్నం మల్లిరాజు(21) విజయవాడలోని ఓట్రాన్స్‌పోర్టు కంపెనీలో పనిచేస్తున్నాడు.

కారు ఢీకొని యువకుడి మృతి

ఉయ్యూరు, నవంబరు 23: విజయవాడ -మచిలీపట్నం రహదారిపై మం టాడ చెక్‌పోస్టు సమీపాన రోడ్డు దాటుతున్న యువకుడిని కారు ఢీకొంది. దీంతో యువకుడు అక్కడికక్కడే మరణించాడు. పమిడిముక్కల మండలం అగినపర్రు గ్రా మానికి చెందిన చిన్నం మల్లిరాజు(21) విజయవాడలోని ఓట్రాన్స్‌పోర్టు కంపెనీలో పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం విజయవాడ నుంచి వస్తూ మంటాడ చెక్‌పోస్టు సమీపాన రోడ్డు దాటుతుండగా పామర్రు వైపు నుంచి వస్తున్న కారు ఢీకొంది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-11-24T00:47:07+05:30 IST