శ్రీశైలంలో కార్తీక శోభ

ABN , First Publish Date - 2022-11-21T02:17:28+05:30 IST

శ్రీశైలం క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసం నాలుగో ఆదివారం, సోమవారం

శ్రీశైలంలో కార్తీక శోభ

శ్రీశైలం, నవంబరు 20: శ్రీశైలం క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసం నాలుగో ఆదివారం, సోమవారం పురస్కరించుకుని క్షేత్రానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో క్షేత్ర వీధులన్నీ రద్దీగా మారాయి. భక్తులు వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిఅమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. రద్దీ దృష్ట్యా భక్తులకు స్వామివారి అలంకరణ దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు.

Updated Date - 2022-11-21T02:17:30+05:30 IST