వైసీపీని గద్దె దింపి సాగనంపాలి : టీడీపీ
ABN , First Publish Date - 2022-08-12T05:07:10+05:30 IST
సీఎం జగన్మోహన్రెడ్డి సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన వైసీపీని ప్రజలు ఇంటికి సాగనంపాలని జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జి దేవగుడి భూపే్షరెడ్డి పిలుపునిచ్చారు
జమ్మలమడుగు రూరల్, ఆగస్టు 11: సీఎం జగన్మోహన్రెడ్డి సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన వైసీపీని ప్రజలు ఇంటికి సాగనంపాలని జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జి దేవగుడి భూపే్షరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం దానవులపాడులో భూపే్షరెడ్డి బాదుడే బాదుడులో భాగంగా దానవులపాడులో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు దేవరాజు, చిట్టిబాబు, అనిల్, లూకయ్య, డేవిడ్, ప్రభాకర్, ఓబులేసు, జయపాల్ పాల్గొన్నారు.