పేదలను ఆదుకోవడంలో వైసీపీ విఫలం: టీడీపీ
ABN , First Publish Date - 2022-09-14T04:39:14+05:30 IST
పేదలను ఆదుకోవడంలో వైసీపీ పభ్రుత్వం విఫలమైందని టీడీపీ కడప నియోజకవర్గ ఇనచార్జ్ అమీర్బాబు ధ్వజమెత్తారు.
కడప (ఎర్రముక్కపల్లె), సెప్టెంబరు 13 : పేదలను ఆదుకోవడంలో వైసీపీ పభ్రుత్వం విఫలమైందని టీడీపీ కడప నియోజకవర్గ ఇనచార్జ్ అమీర్బాబు ధ్వజమెత్తారు. మంగళవారం కడ ప నగరం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ ప్ర భుత్వాన్ని మైనార్టీలు చీదరించుకుంటున్నారన్నారు. దుల్హన పథకాన్నిదేశంలో ఏ రాష్ట్రంలోని లేని విధంగా చంద్రబాబు ప్రవే శపెట్టారని చెప్పారు.జగనమోహనరెడ్డి తన మ్యానిఫెస్టోను ఖురాన, బైబిలు, భగవద్గీత లాగా భావిస్తానని పాదయాత్రలో చెప్పినా ఆ మూడింటిని అవమానించేలా జగన ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వికాస్ హరిక్రిష్ణ, నగర అధ్యక్షులు సానపురెడ్డి శివకొండారెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి జలతోటి జయకకుమార్, రాష్ట్ర నాయకులు రవిశంకర్రెడ్డి, సీఎస్ నాసర్ ఆలీ, శివ, కొమ్మలపాటి సుబ్బరాయుడు, హమీద్బుఖారి, జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు.