తేలుకాటుతో మహిళ మృతి
ABN , First Publish Date - 2022-05-25T04:58:28+05:30 IST
పెద్దగురవలూరులో తాళ్లగిరి కృష్ణవేణి (47) తేలు కుట్టడంతో మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు.
చాపాడు, మే 24: పెద్దగురవలూరులో తాళ్లగిరి కృష్ణవేణి (47) తేలు కుట్టడంతో మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. 23న సోమవారం వేరుశనగ పైరు లో గట్టుపై గడ్డి కోస్తుండగా తేలు కుట్టిందన్నారు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కో సం ఆమెను ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకుపోయారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతిచెందినట్లు తెలిపారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎంపీపీ లక్షుమయ్య, సొసైటీ ఛైర్మన్ వేమారెడ్డి ఆమె కుటుం బ సభ్యులను ఓదార్చి సంతాపం తెలిపారు.