ఆర్టీసీ బస్టాండును పునఃప్రారంభిస్తాం
ABN , First Publish Date - 2022-12-17T22:56:32+05:30 IST
లక్కిరెడ్డిపల్లె ఆర్టీసీ బస్టాండును అన్ని వసతులతో పునః ప్రారం భిస్తున్నట్లు రాయచోటి ఆర్టీసీ డీఎం ధనుంజయ తెలిపారు.
లక్కిరెడ్డిపల్లె, డిసెంబరు 17: లక్కిరెడ్డిపల్లె ఆర్టీసీ బస్టాండును అన్ని వసతులతో పునః ప్రారం భిస్తున్నట్లు రాయచోటి ఆర్టీసీ డీఎం ధనుంజయ తెలిపారు. శనివారం లక్కిరెడ్డిపల్లెలోని ఆరీ ్టసీ బస్టాండును ఆయన పరిశీ లించి, బస్టాండు ఆవరణను శు భ్రం చేయించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా వినియోగంలో లేని ఆర్టీసీ బస్టాండులో తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేసి, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బం దులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని, , లక్కిరెడ్డిపల్లె మీదుగా వచ్చే సర్వీసులన్నీ బస్టాండులో ఆగేలా చర్యలు తీసుకుంటా మన్నారు. వరికుంటపల్లె, పాలెం గొల్లపల్లె తదితర సర్వీసులు ఈ బస్టాండునుంచి నడుపుతామన్నారు. ప్రయాణికులు మూడు రోడ్ల కూడలిలో నిలవకుండా అందరూ బస్టాండుకు వచ్చి బస్సులు ఎక్కి వెళ్లాలన్నారు.