చాపాడు కెనాల్కు నీరు విడుదల
ABN , First Publish Date - 2022-08-02T04:57:03+05:30 IST
రాజోలి ఆనకట్ట వద్ద ఖరీఫ్ పంటలు సాగు చేసుకునేందుకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఇన్ఛార్జి ఎంపీపీ ఎస్ఏ నారాయణరెడ్డి పేర్కొన్నారు.
రాజుపాళెం, ఆగస్టు 1: రాజోలి ఆనకట్ట వద్ద ఖరీఫ్ పంటలు సాగు చేసుకునేందుకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఇన్ఛార్జి ఎంపీపీ ఎస్ఏ నారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాజోలి ఆనకట్ట వద్ద ఎస్ఏ నారాయణరెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు అంజనీదేవి నీటిని విడుదలచేశారు. డీఈ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ చాపాడు కెనాల్కు 70 క్యూసెక్కుల నీటిని దిగువకు నీటిని విడుదల చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ కాలువ పరిధిలో రాజుపాళెం, ప్రొద్దుటూరు, చాపాడు మండలాల్లోని 18,452 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. వచ్చే ఏడాది జనవరి వరకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉందన్నారు. వైసీపీ నాయకులు సూర్యనారాయణరెడ్డి, గోవర్దన్రెడ్డి, ఖాదర్బాష, వెంకటరెడ్డి, రాజారెడ్డి, ఏఈ జాన్సన్ పాల్గొన్నారు.