చెత్తసంపద కేంద్రాలను వినియోగించాలి
ABN , First Publish Date - 2022-10-15T05:04:48+05:30 IST
గ్రామాలలో చెత్తసంపద తయారీకేం ద్రాలను పూర్తిస్థాయిలో వినియోగిం చుకుని సంపదను సృష్టించుకోవాలని డీపీవో నాగరాజు అధికారులను ఆదే శించారు.
అక్రమ లేఅవుట్లకు నోటీసులు జారీ చేయండి : డీపీవో నాగరాజు
మదనపల్లె రూరల్, అక్టోబరు 14: గ్రామాలలో చెత్తసంపద తయారీకేం ద్రాలను పూర్తిస్థాయిలో వినియోగిం చుకుని సంపదను సృష్టించుకోవాలని డీపీవో నాగరాజు అధికారులను ఆదే శించారు. శుక్రవారం మండలంలోని సీటీయం, పొన్నూటిపాలెం గ్రామపం చాయతీలలో ఆయన పర్యటించి చెత్త సంపద తయారీకేంద్రాలను పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గ్రామాలలో ఇళ్ల నుంచి చెత్తను సేకరించి, సంపద కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకుని తద్వారా పంచాయతీల కు ఆదాయాన్ని పెంచుకోవాలన్నారు. అదేవిధంగా గ్రామాలలో వేస్తున్న అనధికార లేఅవుట్లను గుర్తించి వాటి యజమానులకు నోటీసులు జారీ చేయాలన్నారు. గ్రామా లలో వందశాతం ఇంటిపన్నులు వసూలు చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగులు పనితీరు మెరుగురుచుకుని, ప్రభుత్వం అందించే సంక్షేమపథకాలు ప్రజలకు చేర్చాల న్నారు. ఈ కార్యక్రమంలో సీటీయం సర్పంచు ఆనందపార్థసారథి, డీఎల్పీవో జయకు మారి, పంచాయతీ కార్యదర్శులు శ్రీహరి, సుశీల తదితరులు పాల్గొన్నారు.