రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో.... ఒకరు మృతి - ఇద్దరికి గాయాలు
ABN , First Publish Date - 2022-12-06T23:17:10+05:30 IST
రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో శ్రావణి(22) మృతి చెందగా సురే్షకుమార్, వెంకటే్షకు తీవ్రగాయాలయ్యా యి.
సిద్దవటం, డిసెంబరు 6: రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో శ్రావణి(22) మృతి చెందగా సురే్షకుమార్, వెంకటే్షకు తీవ్రగాయాలయ్యా యి. కడప-చెన్నై రహదారి భాకరాపేట చెక్పోస్టు వద్ద మంగళవారం ఉద యం వేంపల్లి నుంచి ఒంటిమిట్టకు వస్తున్న మోటారు బైకు, మాధవరం నుం చి కడపకు వెళుతున్న స్కూటీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో మోటారు బైకుపై ప్రయాణిస్తున్న వేంపల్లె మండలం ఇడుపులపాయి వాసి సురే్షకుమార్కు గాయాలయ్యాయి.
మాధవరం నుంచి స్కూటీపై వెళుతున్న శ్రావణి, వెంకటే్షకు గాయాలయ్యాయి. కిందపడిన శ్రావణి నడుముపైకి లారీ ఎక్కిపోవడంతో ఆమెకు అధిక రక్తస్రావమైంది. ఆమెను స్థానికులు చికిత్స నిమి త్తం 108లో కడప రిమ్స్కి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలిస్తుండగా మృతి చెందినట్లు మృతురాలి బంధువులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.
మూడు కార్లు ఢీ - ఇద్దరికి గాయాలు
రామాపురం, డిసెంబరు 6: కర్నూలు- చిత్తూరు 40వ జాతీయ రహదారిపై కర్ణపువాండ్లపల్లె సమీపంలో మంగళవారం సాయంత్రం మూడు కార్లు ఢీకొన డంతో కారులో ఉన్న లీలావతి, అతురియాకు తీవ్ర గయాలైనట్లు ఎస్ఐ కొం డారెడ్డి తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... పుంగనూ రు నుంచి చాగమలమర్రికి వెళ్తున్న కారు కర్ణపువాండ్లపల్లె వద్ద కడప నుంచి రాయచోటి వైపు వెళుతున్న కారు ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న కారును, మరో కారును ఢీకొంది. ప్రమాదంలో ఏపీ02 బీబీ8225 నెంబరు కారులో ప్రయాణిస్తున్న లీలావతి, అతూరీయాకు తీవ్రగాయాలయ్యాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని క్షతగాత్రుల ను చికిత్స నిమిత్తం 108లో రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కొండారెడ్డి తెలిపారు.