పరిపాలించేది చేతకాకనే ప్రజలపై ధరల భారం
ABN , First Publish Date - 2022-05-16T05:30:00+05:30 IST
రాష్ట్రాన్ని పరిపాలించేది చేతకాకనే ప్రజలపై జగన్మోహన్రెడ్డి ప్రభు త్వం మోయలేని భారం మో పిందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.
నిమ్మనపల్లె, మే 16: రాష్ట్రాన్ని పరిపాలించేది చేతకాకనే ప్రజలపై జగన్మోహన్రెడ్డి ప్రభు త్వం మోయలేని భారం మో పిందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. సోమవారం సైదాపటలో మండల అధ్యక్షుడు వెంకటరమణ ఆద్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ జగన్ అధికారంలోకి రాగానే కరెంట్, పెట్రోల్, డీజిల్, ఇసుక, స్టీల్, గ్యాస్ తదితర వాటిపై రేట్లు పెంచారన్నారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాల ద్వారా వైసీపీ పెంచిన చార్జీలపై వివరించారు. ఏపీని అప్పుల ఊభినుంచి భయట పడడానికి చంద్రబాబును మళ్లీ ముఖ్యంత్రిని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీసీసెల్ అధికార ప్రతినిధి లక్ష్మన్న, మునిరత్నం, మురళి, రామచంద్ర, భూపతి విజయ్, చంద్ర, గోపి, నరేంద్ర, జయరాం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.