రేషన్ బియ్యంపై ఉద్యమిస్తాం
ABN , First Publish Date - 2022-05-23T05:06:54+05:30 IST
రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలిపి పంపిణీ చేస్తున్నారని, ఈ విషయమై ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఈవీ సుధాకర్రెడ్డి, తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు హెచ్చరించారు.
బాదుడే బాదుడు కార్యక్రమంలో టీడీపీ నేతలు
ప్రొద్దుటూరు క్రైం, మే 22 : రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలిపి పంపిణీ చేస్తున్నారని, ఈ విషయమై ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఈవీ సుధాకర్రెడ్డి, తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం 33వ వార్డులో బాదుదే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జగన్ ప్రభుత్వాన్ని మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారని, అలాంటి వారిపై సీఎం జగన్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ కార్యకర్తలతో దాడులు చేయిస్తున్నారన్నారు. వీరి ఆటలు ఎంతో కాలం సాగవని, వైసీపీ ప్రభుత్వానికి ఎప్పుడెప్పుడు బుద్ధ్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధ్దంగా ఉన్నారన్నారు. సంక్షేమం సాకుతో రాష్ట్రాన్ని అంధకారమయం చేశారన్నారు. ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించారన్నారు. ప్రజలకు కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఎన్టీయుసీ జిల్లా అధ్యక్షులు కుతుబుద్దీన్, పెద్దసంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.