‘సిద్దేశ్వరం’ తోనే నీటిని పొందే అవకాశం
ABN , First Publish Date - 2022-05-28T05:15:53+05:30 IST
రాయలసీమ ప్రాంతం నికరజలాలు లేక, మిగులుజలాలపై అధారపడి కరువుసీమగా మిగిలిపోతోందని, ఈ పరిస్థితుల్లో సిద్దేశ్వరం అలునిర్మాణం ద్వారానే, గతంలో రాయలసీమ కోల్పోయిన నీటిని తిరిగి పొందే అవకాశం ఉందని ప్రముఖ శస్త్రచికిత్స వైద్యనిపుణుడు డాక్టర్ నాగదస్తగిరిరెడ్డి అభిప్రాయపడ్డారు.
ప్రొద్దుటూరు క్రైం, మే 27 : రాయలసీమ ప్రాంతం నికరజలాలు లేక, మిగులుజలాలపై అధారపడి కరువుసీమగా మిగిలిపోతోందని, ఈ పరిస్థితుల్లో సిద్దేశ్వరం అలునిర్మాణం ద్వారానే, గతంలో రాయలసీమ కోల్పోయిన నీటిని తిరిగి పొందే అవకాశం ఉందని ప్రముఖ శస్త్రచికిత్స వైద్యనిపుణుడు డాక్టర్ నాగదస్తగిరిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆయన నివాసంలో సిద్దేశ్వరం అలుగు నిర్మాణ జలదీక్ష పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 31న రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టే జలదీక్షలో రాయలసీమ జిల్లాల నుంచి ప్రజలు విరివిరిగా పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో శివాలయం చైర్మన్ రాంప్రసాద్రెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రతినిధి సదా ఓబుల్రెడ్డి ,ఎంఎ్సఎన్ఆర్ సేవాట్రస్ట్ అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి, శివోహం అన్నప్రసాద సేవా సంఘం ఉపాధ్యక్షుడు విష్ణునారాయణరెడ్డి, వనభోజన సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి, స్పందన ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.