జిల్లాలో 88 ఆలయాల నిర్మాణానికి అనుమతి
ABN , First Publish Date - 2022-12-31T23:37:54+05:30 IST
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 88 దేవాలయాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్బాలాజీ తెలిపారు.
ప్రొద్దుటూరు టౌన్, డిసెఒంబరు 31: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 88 దేవాలయాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్బాలాజీ తెలిపారు. రామాలయం పథకంలో భాగంగా టీటీడీ నిధులతో ఆలయాలను నిర్మిస్తామన్నారు. ఆలయాల నిర్మాణం కోసం దరఖాస్తు చేసిన వారు దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో సంప్రదించి నిర్మాణ పనులు చేపట్టాలని, ఏప్రిల్ నాటికి ఆలయ నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు. ఒక్కో ఆలయ నిర్మాణానికి రూ.10లక్షలు అందిస్తామని తెలిపారు.