చింతకుంటలో ఆర్కిటెక్చర్‌ విద్యార్థుల పరిశీలన

ABN , First Publish Date - 2022-11-15T23:28:30+05:30 IST

ముద్దనూరు మండలం చింతకుంట లో హార్టికల్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ విద్యార్థులు చరిత్ర పూర్వ రాక్‌ ఆర్ట్స్‌పై కేస్‌ స్టడీ కోసం పరిశీలించారు. ఈ ప్రదేశం కళా సంస్కృతికి ప్రసిద్ది చెందింది.

చింతకుంటలో ఆర్కిటెక్చర్‌ విద్యార్థుల పరిశీలన
చింతకుంటలో పరిశీలిస్తున్న విద్యార్థులు

కడప (ఎడ్యుకేషన్‌), నవంబరు 15: ముద్దనూరు మండలం చింతకుంట లో హార్టికల్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ విద్యార్థులు చరిత్ర పూర్వ రాక్‌ ఆర్ట్స్‌పై కేస్‌ స్టడీ కోసం పరిశీలించారు. ఈ ప్రదేశం కళా సంస్కృతికి ప్రసిద్ది చెందింది. ఇది 8వేల ఏళ్ల చరిత్రను దాని చారిత్రక ప్రాముఖ్యతతో కలిసి ఉంది. ఇది మధ్యప్రదేశ్‌లోని బీమ్‌లొడ్గా, తరువాత రెండో అతి పెద్ద రాక్‌ ఆర్ట్స్‌గా పరిగణించబడుతుందని వారు తెలిపారు. చుట్టూ ఉన్న 15 రాళ్లపై 200 కం టే ఎక్కువ పెయింటింగ్‌లు మిథోలిక్‌ కాలంలో చేయబడ్డాయన్నారు. విద్యార్థులు రాక్‌ పెయింటింగ్‌, రూపం, ఆకారం ఉపయోగించిన పదార్థా లు, పరిసరాలు, మానవ బొమ్మలు, జంతువులు, సరీసృపాలు తదితర వా టితో పాటు రాక్‌ ఆర్ట్స్‌ సైట్‌ను అన్వేషించారు. కార్యక్రమంలో పెయింటింగ్‌ కోకన్వీనర్‌ తరుణ్‌మండల్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-15T23:28:31+05:30 IST