ఉక్కు పరిశ్రమకు ఉద్యమంలా కదలిరండి
ABN , First Publish Date - 2022-12-06T23:35:19+05:30 IST
రాయలసీమ ప్రజల హక్కు అయినటువంటి ఉక్కు పరిశ్రమకై ఉద్యమంలా ప్రతి ఒక్కరూ కదలి రావాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వీరశేఖర్ పేర్కొన్నారు.
బద్వేలు, డిసెంబరు 6: రాయలసీమ ప్రజల హక్కు అయినటువంటి ఉక్కు పరిశ్రమకై ఉద్యమంలా ప్రతి ఒక్కరూ కదలి రావాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వీరశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 9 నుంచి 13వ తేదివరకు జరుగుతున్న పాదయాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. సమావేశం అనంతరం పాదయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఏరియా, సహాయ కార్యదర్శి చంద్రమోహన్రాజు, జిల్లా సమితి సభ్యులు పాల్గొన్నారు.