చంద్రబాబును కలసిన మైనార్టీ నేత మస్తాన

ABN , First Publish Date - 2022-11-06T23:40:38+05:30 IST

టీడీపీ జాతీ య అఽధ్యక్షుడు నారా చంద్రబాబునా యుడును శనివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ విభాగం రాష్ట్ర మైనారిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌ఏ మస్తాన మర్యాద పూర్వకంగా కలిశారు.

చంద్రబాబును కలసిన మైనార్టీ నేత మస్తాన

చంద్రబాబుతో మైనార్టీ నేత మస్తాన

మదనపల్లె, నవంబరు 6: టీడీపీ జాతీ య అఽధ్యక్షుడు నారా చంద్రబాబునా యుడును శనివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ విభాగం రాష్ట్ర మైనారిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌ఏ మస్తాన మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మస్తాన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మదనపల్లె నియోజకవర్గ అసెంబ్లీ టికెట్‌ను మైనారిటీలకు కేటాయిం చాలని కోరినట్లు చెప్పారు. దీనిపై స్పందించిన చంద్రబాబు మాట్లాడుతూ పార్టీ కోసం అందరూ కలసి కట్టుగా పనిచేస్తూ బలోపేతం చేయాలన్నారు. 2024 ఎన్ని కల్లో పరిశీలించి మైనారిటీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. అనంతరం నియోజకవర్గ సమస్యలను చంద్రబాబుకు వివరించినట్లు చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తామని సూచించినట్లు తెలిపారు. గ్రూప్‌ రాజకీయాలకు చోటివ్వకుండా పార్టీ కోసం పనిచేయాలంటూ చంద్రబాబు స్పష్టం చేశారని మస్తాన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-06T23:40:41+05:30 IST