రణభేరి సభను జయప్రదం చేయండి
ABN , First Publish Date - 2022-09-30T05:30:00+05:30 IST
మండల కేంద్రమైన పెండ్లిమర్రి డిగ్రీ కళాశాలలో ఆదివారం రాజ్యాధికార రణభేరి 2వ సభను జయప్రదం చేయాలని మహాసభ రాష్ట్ర సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు యామవరం చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
పెండ్లిమర్రి, సెప్టెంబరు 30: మండల కేంద్రమైన పెండ్లిమర్రి డిగ్రీ కళాశాలలో ఆదివారం రాజ్యాధికార రణభేరి 2వ సభను జయప్రదం చేయాలని మహాసభ రాష్ట్ర సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు యామవరం చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం పెండ్లిమర్రిలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ రాజ్యాధికార రణభేరి సభను కమలాపురం నియోజకవర్గానలలోని అన్ని మండలాలలో ఏర్పాటుచేస్తూ ముందుకు వీరపునాయునిపల్లెలో సభ నిర్వహించామన్నారు.