డోర్ టు డోర్ చెత్త సేకరణ నిర్వహించాలి
ABN , First Publish Date - 2022-12-09T23:35:53+05:30 IST
ప్రతిరోజూ వంద శాతం డోర్ టు డోర్ చెత్త సేకరణ చేయాలని కమిషనర్ ప్రవీణ్చంద్ ఆదేశించారు.
కమిషనర్ ప్రవీణ్చంద్
కడప (ఎర్రముక్కపల్లె) డిసెంబరు 9 : ప్రతిరోజూ వంద శాతం డోర్ టు డోర్ చెత్త సేకరణ చేయాలని కమిషనర్ ప్రవీణ్చంద్ ఆదేశించారు. కడప నగరం ఓల్డ్ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం కొత్త గా వచ్చిన 25 క్లాప్ ఆటోలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరానికి కొత్త ఆటోలు రావడంతో చెత్త సేకరణలో మరింత పరిశుభ్రతను పాటించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజూ డోర్ టు డోర్ కలెక్షన చేయాలని సూచించారు. అలాగే మెయిన రోడ్డులో పరిశుభ్రతను ఎప్పటికప్పుడు చేస్తూ కడప నగరాన్ని శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఎంఎ్సఓతో పాటు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.