AP: వివేకా హత్య కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు
ABN , First Publish Date - 2022-02-08T18:33:02+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ముగ్గురు నిందితులకు పులివెందుల కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది.
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ముగ్గురు నిందితులకు పులివెందుల కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, సునిల్ కుమార్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలకు ఫిబ్రవరి 22 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం ముగ్గురు నిందితులను అధికారులు కడప సెంట్రల్ జైలు నుంచి ఆన్లైన్ ద్వారా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.