Kadapa: అన్నమయ్య జిల్లా కోసం కొనసాగుతున్న ఆందోళన
ABN , First Publish Date - 2022-02-26T16:14:32+05:30 IST
రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.
కడప: రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అఖిలపక్షం జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు రాజంపేట బార్డర్ వెంకట్రా జంపేట నుండి కడప వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. కాగా.. 144 సెక్షన్ పేరుతో పోలీసులు పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముందస్తుగా బీజేపీ నేత నాగు బోతురమేష్తో పాటు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. జేఏసీ కన్వీనర్ టీడీపీ నేత చంగల్ రాయుడును అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు.