మూడు రాజధానుల కోసం సుప్రీం కోర్టుకు వెళితే జగన్ చరిత్రహీనుడే
ABN , First Publish Date - 2022-03-05T05:25:05+05:30 IST
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మూడు రాజధానుల కోసం సీఎం జగన్ సుప్రీంకోర్టుకు వెళితే చరిత్ర హీనుడుగా నిలిచిపోతారని జేఏసీ కన్వీనర్ జేవీ రమణ, టీడీపీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి బి.హరిప్రసాద్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పేర్కొన్నారు. శుక్రవారం
జేఏసీ కన్వీనర్ జేవీ రమణ, టీడీపీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి బి.హరిప్రసాద్
కడప, మార్చి 4 (ఆఽంధ్రజ్యోతి): హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మూడు రాజధానుల కోసం సీఎం జగన్ సుప్రీంకోర్టుకు వెళితే చరిత్ర హీనుడుగా నిలిచిపోతారని జేఏసీ కన్వీనర్ జేవీ రమణ, టీడీపీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి బి.హరిప్రసాద్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పేర్కొన్నారు. శుక్రవారం హరిటవర్స్లో వారు విలేకరులతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పు మూడేళ్ల వైసీపీ మూర్ఖపు పాలనకు చెంపపెట్టులాంటిదన్నారు. అమరావతి రాజధానిగా ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ఆమోదించిన సీఎం దానికే కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం, కులాలు మతాలకు అతీతంగా ప్రజలంతా తీర్పును స్వాగతిస్తున్నారన్నారు. కార్యక్రమలంలో జేఏసీ నేతలు అవ్వారు మల్లికార్జున, ప్రతా్పరెడ్డి, అమీర్బాషా, జయరామ్, సీపీఐ నగర కార్యదర్శి వెంకటశివ పాల్గొన్నారు.