ఇది మాయల మరాఠీ ప్రభుత్వం
ABN , First Publish Date - 2022-05-19T05:51:48+05:30 IST
రాష్ట్రంలో మాయల మరాఠీల పాలన సాగుతోందని కాంగ్రెస్ పార్టీ రాయచోటి నియోజకవర్గ ఇన్చార్జి గోల్డ్ అల్లాబకష్ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గోల్డ్ అల్లాబకష్
రాయచోటిటౌన్, మే18: రాష్ట్రంలో మాయల మరాఠీల పాలన సాగుతోందని కాంగ్రెస్ పార్టీ రాయచోటి నియోజకవర్గ ఇన్చార్జి గోల్డ్ అల్లాబకష్ అన్నారు. బుధవారం ఆయన రాయచోటి మున్సిపాలిటీలోని 9వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ చైర్మెన్ సహా మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ ఏకగ్రీవమైనా ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. రూ.380 కోట్లు మున్సిపాలిటీ అభివృద్ధికి విడుదలయ్యాయని చెప్పుకొంటున్న వైసీపీ నాయకులు ఆ డబ్బును ఎక్కడ దాచిపెట్టారో చెబితే ప్రజలే ఆ డబ్బు తెచ్చుకుని సమస్యలు పరిష్కరించుకుంటారన్నారు. స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మన్సూర్అలీఖాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దర్బార్బాషా, శర్వాణీ షారూక్ఖాన్, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు ఫయాజ్ పాల్గొన్నారు.