ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి
ABN , First Publish Date - 2022-08-24T04:56:28+05:30 IST
టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా మంగళవారం నిమ్మనపల్లె సర్కిల్లోని టీడీపీ కార్యాలయంలో పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేశ్ ఆధ్వ ర్యంలో నివాళులర్పించారు.
మదనపల్లె టౌన్, ఆగస్టు 23: టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా మంగళవారం నిమ్మనపల్లె సర్కిల్లోని టీడీపీ కార్యాలయంలో పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేశ్ ఆధ్వ ర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీరామ్చినబాబు మాట్లా డుతూ స్వాతంత్య్ర పోరాటంలో ప్రకాశం పంతులు చూపిన ధీరత్వం మరువలేనిదన్నారు. ఆర్జే వెంకటేశ్ మాట్లాడారు. అనంతరం ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలుజల్లి నివాళులర్పించారు. టీడీపీ నాయకు లు దొరస్వామినాయుడు, విజయమ్మ, అరుణ్తేజ్, ఆదినారాయణ, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
వాల్మీకిపురం: వాల్మీకిపురం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో, పీవీసీ ప్ర భుత్వ ఉన్నత పాఠశాలలో టంగుటూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హెచ్ఎం వెంకటరత్నం, జేవీవీ అధ్యక్షుడు ప్రభుచరణ్, ఉపాధ్యాయులు నాగరాజు, మండవ్యపురుషోత్తం, చెంగ య్య, వెంకటేశ్వరరెడ్డి, శంకర్, రసూల్ బావాజీ, విద్యార్థులు పాల్గొన్నారు.
కలికిరి: స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో మొక్కుబడిగా నివాళులర్పిం చారు. కనీసం ప్రకాశం చిత్రపటం పెట్టి ఒక పూలమాల వేయక పోవడాన్ని తప్పుబడుతున్నారు. స్థానిక గ్రంఽథాలయంలో ప్రకాశం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రంథాలయ అధికారి విజయకుమార్, రచయిత జరుగుమల్లి వీరయ్య, జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.