విదేశీ విద్యకు నిధులు విడుదల చేయాలి
ABN , First Publish Date - 2022-01-28T04:47:46+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం విదేశీ విద్యకు నిధులు వి డుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని ఏపీ బీసీ చైత న్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు బీసీ రమణ ప్రభుత్వాన్ని కోరారు.
బద్వేలు రూరల్, జనవరి 27: రాష్ట్ర ప్రభుత్వం విదేశీ విద్యకు నిధులు వి డుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని ఏపీ బీసీ చైత న్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు బీసీ రమణ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఏపీబీసీ చైతన్య కమిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక పథకానికి ఉన్నఫలంగా నిధులు నిలిపేస్తే లబ్ధిదా రులు తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విదేశీ విద్యకు నిధులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చైతన్య కమిటీ రాష్ట్ర యువజన అధికార ప్రతినిధి సునీల్ తదితరులు పాల్గొన్నారు.