మట్కా, గుట్కా, దొంగతనాలపై దృష్టి పెట్టండి : ఎస్పీ
ABN , First Publish Date - 2022-08-18T05:17:46+05:30 IST
మట్కా నిర్వహణ, గుట్కా అమ్మకాలు, దొంగత నాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ పోలీసు అధికారులను ఆదేశించారు.
ఎర్రగుంట్ల, ఆగస్టు 17: మట్కా నిర్వహణ, గుట్కా అమ్మకాలు, దొంగత నాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్పీ కలమల్ల పోలీసుస్టేష న్ను ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సేష్టన్ ఆవరణలో మంచి వాతావరణాన్ని నెలకొల్పాలన్నారు. దొంగతనాలను అరికట్టేందుకు గస్తీని ముమ్మరం చేయాలన్నారు. నాటుసారా, అక్రమమద్యం ఇసుక అక్రమరవాణా లాంటి అసాంఘిక కార్యాక్రమాలపై ప్రత్యేక నిఘా పెట్టి దాడులు ముమ్మరం చేయాలన్నారు. మహిళల భద్రతకు పోలీసుశాఖ ప్రత్యేంగా రూపొందిం చిన దిశ యాప్పై అందరికి అవగాహన కల్పించాలన్నారు. యాప్ను ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకునేలా చైతన్యం కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని సీఐ సుదర్శన్ ప్రసాద్, ఎస్ఐ శివప్రసాద్లను ఆదేశించారు.