ఉత్సాహంగా ఏపీ ట్రాన్స్కో ఉద్యోగుల క్రీడలు
ABN , First Publish Date - 2022-01-23T05:03:23+05:30 IST
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ట్రాన్స్కో చీఫ్ ఇంజనీర్ ఎస్.శ్రీరాములు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
క్రికెట్ ఫైనల్ విజేత తిరుపతి జట్టు
కడప (మారుతీనగర్), జనవరి 22 : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ట్రాన్స్కో చీఫ్ ఇంజనీర్ ఎస్.శ్రీరాములు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈనెల 20 నుంచి 25 వరకు విద్యుత్ ఉద్యోగులకు (పురుషులు, మహిళలకు) సంబంధిత కార్యనిర్వాహకులు ఈఈ గిరిధర్, ఏఈఈ గోవిందరాజు సారధ్యంలో వివిధ క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం స్థానిక డీఎ్సఏ మైదానంలో జరిగిన క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో తలమంచిపట్నం 400 కె.వి.సబ్స్టేషన్ జట్టుపై తిరుపతి జట్టు విజయం సాధించింది. విజేత జట్టుకు ఈనెల 26న బహుమతులను అందజేయనున్నారు. కార్యక్రమంలో ట్రాన్స్కో డీఈ శ్రీనాథుడు, ఉద్యోగులు మస్తాన్, వీరాంజనేయులు, వెంకటరమణ, సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.