జాతీయ మహాసభకు తరలిరండి: ఎమ్మార్పీఎస్
ABN , First Publish Date - 2022-12-09T23:39:56+05:30 IST
ప్రస్తుత శీతాకాల పార్లమెంట్ సమావేశాలలోనే ఎస్సీ రిజర్వేషన వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్తో 2023 జనవరి 6న బెంగళూరులో తలపెట్టిన జాతీయ మహాసభకు జిల్లాలోని మాదిగలు వేలాదిగా తరలిరావాలని మాదిగ రిజర్వేషన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్ మాదిగ పిలుపునిచ్చారు.
కడప (మారుతీనగర్), డిసెంబరు 9: ప్రస్తుత శీతాకాల పార్లమెంట్ సమావేశాలలోనే ఎస్సీ రిజర్వేషన వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్తో 2023 జనవరి 6న బెంగళూరులో తలపెట్టిన జాతీయ మహాసభకు జిల్లాలోని మాదిగలు వేలాదిగా తరలిరావాలని మాదిగ రిజర్వేషన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్ మాదిగ పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ కన్వీనర్ మానికింది వెంకటేష్ సారథ్యంలో శుక్రవారం స్థానిక ప్రెస్క్లబ్లో జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. బీజేపీ నాయకులు గత ఎన్నికల ముందు కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులలోపే ఎస్సీ వ ర్టీకరణ చేసి చూపుతామని ప్రగల్భాలు పలికారని, నేటికీ ఆ ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంఎ్సపీ నాయకులు శివయ్య, కైలాసు, మాతయ్య, మనోహర్, పిచ్చిమల్లు గాళ్ళ గంగులయ్య తదితరులు పాల్గొన్నారు.