సిద్ధ్దేశ్వరం అలుగు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలి : కుంచం
ABN , First Publish Date - 2022-11-30T23:53:58+05:30 IST
రాయలసీమ నీటి సమస్యకు పరిష్కారమైన సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టును నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాలని రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.
ప్రొద్దుటూరు క్రైం, నవంబరు 30 : రాయలసీమ నీటి సమస్యకు పరిష్కారమైన సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టును నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టాలని రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎం జగన్మోహన్రెడ్డికి బహిరంగలేఖ పంపారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో కుంచం విలేఖరులతో మాట్లాడుతూ రాయలసీమ ప్రజల డిమాండు అయిన సిద్ధ్దేశ్వరం అలుగు ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరం చేపట్టాలని ఆయన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ ప్రధాన సలహాదారుడు సోమసుందర్రెడ్డి, సమన్వయకర్త క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.