‘ఇదేం ఖర్మ మన రాషా్ట్రనికి..’ పోస్టరు విడుదల
ABN , First Publish Date - 2022-12-02T00:07:09+05:30 IST
‘ఇదేం ఖర్మ మన రాషా్ట్రనికి..’ అంటూ గురువారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోస్టరు విడుదల చేశారు.
కడప (ఎర్రముక్కపల్లె), డిసెంబరు 1: ‘ఇదేం ఖర్మ మన రాషా్ట్రనికి..’ అంటూ గురువారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోస్టరు విడుదల చేశారు. కడప నగరం టీడీపీ జిల్లా కార్యాలయంలో గురువారం టీడీపీ కడప నియోజకవర్గ ఇనచార్జ్ వీఎస్ అమీర్బాబు ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమంలో అనుసరించాల్సిన అంశాల గురించి వివరించారు. ప్రతి కుటుంబాన్ని మర్యాదపూర్వకంగా కలవాలని, పలకరించాలని, సమస్యలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఇంటింటికీ తిరిగి వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అక్రమాలను ప్రజలకు తెలియజెప్పాలని కోరా రు. అలాగే ప్రజల చేత 9261292612 నెంబరుకు మిస్డ్ కాల్ ఇప్పించి మన పోరాటంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు ఎస్.గోవర్ధనరెడ్డి, హరిప్రసాద్, సానపురెడ్డి శివకొండారెడ్డి, వికాస్ హరిక్రిష్ణ, లక్ష్మీరెడ్డి, జలతోటి జయకుమార్, ఆమూరి బాలదాసు, యాటగిరి రాంప్రసాద్, నబీకోట శ్రీనివాసులు, మాసాపేట కోదండరామ్, జియావుద్దీన, మాసాపేట శివ తదితరులు పాల్గొన్నారు.