గుంటూరు జిల్లా కలెక్టర్‌గా అట్లూరు వాసి వేణుగోపాల్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-04-03T05:30:00+05:30 IST

కొత్తజిల్లాల ఏర్పాటులో మైదుకూరు, బద్వేల్‌ నియోజకవర్గం వాసులకు చోటు లభించింది.

గుంటూరు జిల్లా కలెక్టర్‌గా అట్లూరు వాసి వేణుగోపాల్‌రెడ్డి
గుంటూరు కలెక్టర్‌గా వేణుగోపాల్‌రెడ్డి

నంద్యాల జేసీగా నాగులపల్లె వాసి మౌర్య


మైదుకూరు/ బద్వేల్‌ ఏప్రిల్‌ 3: కొత్తజిల్లాల ఏర్పాటులో మైదుకూరు, బద్వేల్‌ నియోజకవర్గం వాసులకు చోటు లభించింది. బద్వేలు నియోజకవర్గం అట్లూరు మండలం జాఫర్‌ సాహెబ్‌పల్లె పల్లెకు చెందిన మట్లి వేణుగోపాల్‌రెడ్డిని గుంటూ రు జిల్లా కలెక్టర్‌గా,  చాపా డు మండలంలోని నాగలపల్లెకు చెందిన నారపురెడ్డి మౌర్యను నంద్యాల జాయింట్‌ కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. జాఫర్‌ సాహెబ్‌పల్లె పల్లెకు చెందిన మట్లి చిన్న క్రిష్ణరెడ్డి చెన్నమ్మల కుమారుడు వేణుగోపాల్‌రెడ్డి అట్లూరు జడ్పీ హైస్కూల్‌, కళాశాల విద్య  బద్వేల్‌లో అభ్యసించి 2007 సివిల్‌ ఫలితాల్లో స్టేట్‌లో మొదటి స్థానంలో నిలిచారు. ఈయన మొదట పశ్చిమగోదావరి జిల్లా జేసీగా విధులు నిర్వహించారు.  కాగా నాగులపల్లె గ్రామానికి చెందిన చంద్ర ఓబుళరెడ్డి కుమార్తె మౌర్య 2018 సివిల్‌ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 100వ ర్యాంకు సాధించా రు. ఈమెను నూతన జిల్లాలు ఏర్పడటంతో నంద్యాల జాయింట్‌ కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది.   



Updated Date - 2022-04-03T05:30:00+05:30 IST