28న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
ABN , First Publish Date - 2022-05-27T04:57:49+05:30 IST
నందమూరి యువసేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎన్జీవో హోంలో 28వ తేదీ శనివారం ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆ సమితి అధ్యక్ష, ఉపాధ్యక్షులు సుదర్వన్, వెంకటసుబ్బయ్య తెలిపారు.
ప్రొద్దుటూరు క్రైం, మే 26 : నందమూరి యువసేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎన్జీవో హోంలో 28వ తేదీ శనివారం ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆ సమితి అధ్యక్ష, ఉపాధ్యక్షులు సుదర్వన్, వెంకటసుబ్బయ్య తెలిపారు. ఇందుకు సంబంఽధించిన ఆహ్వాన పత్రికను గురువారం టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆ రోజున ఉదయం 9 గంటలకు పొట్టిపాడు రోడ్డు బైపాస్లోని ఎన్టీఆర్ కాంశ్య విగ్రహనికి పూలమాలలు వేసి, నివాళులర్పిస్తామన్నారు. అనంతరం ఎన్జీవో హోంలో రక్తదాన శిబిరం, సాంస్కృతిక కార్యక్రమాలు, నందమూరి అభిమానులకు సన్మానం చేస్తా మన్నారు. కార్యక్రమంలో కడప పార్లమెంట్ తెలుగుయువత కార్యదర్శి ఆంజినేయులు, ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి లక్ష్మినరసింహ, నందమూరి అభిమానులు నాగభూషణం, రాజేష్కుమార్, వ్యానిస్, నాగార్జున పాల్గొన్నారు.