2017 పీఆర్సీ బకాయిలు చెల్లించాలి
ABN , First Publish Date - 2022-04-25T04:48:00+05:30 IST
ఆర్టీసీ ఉద్యోగులకు 2017 పీఆర్సీకి సంబంధించిన బకాయిలు చెల్లించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆర్టీసీ ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్రావు
రాయచోటి, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగులకు 2017 పీఆర్సీకి సంబంధించిన బకాయిలు చెల్లించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం రాయచోటిలోని ఆర్ఆర్ కల్యాణ మండపంలో కడప జిల్లా అధ్యక్షుడు పీఎన్బీ రెడ్డి అధ్యక్షతన రీజనల్ కార్యదర్శి రామ్మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన రీజనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో విలీనానికి ముందు 2020 జూన్లో చేసుకున్న ఒప్పందం ఇంత వరకూ అమలు కాలేదన్నారు.
యూనియన్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యంరాజు, ఉప ప్రధాన కార్యద ర్శి ఆవుల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ జీతాల పెం పుపై జీఓలు విడుదల చేయాలని విజ్ఞప్తిచేశారు. మరో ఉప ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య మాట్లాడుతూ ఫిబ్రవరి 22న ఆర్టీసీ జేఏసీ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్కు 45 డిమాండ్లతో ఒక వినతిపత్రం ఇచ్చామన్నారు. వీట న్నింటిపై త్వరలో ఆర్టీసీ వీసీ, ఎండీకి మరో మెమొరాం డం ఇవ్వనున్నామన్నారు. స్పందనను బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండిపల్లె రాంప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కార్యవర్గం ఎన్నిక
పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ కడప జిల్లా అధ్యక్షుడి గా సుభాష్బాబు (బోస్), జిల్లా కార్యదర్శిగా రామ్మూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్గా మల్లికార్జున, వైస్ ప్రెసిడెంట్గా వెంకటేశ్వర్లు, రాజంపేట డిపో ట్రెజరర్గా ఆర్బీఎస్ హ్మణ్యంను ఎన్నుకున్నారు.