Chandrababu: జగన్‌ పాలనపై జనాగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది

ABN , First Publish Date - 2022-12-24T21:13:19+05:30 IST

Vijayanagaram: జగన్‌ ప్రభుత్వం (CM Jagan)పై ప్రజల్లో ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోందని టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయనగరం కోట కూడలిలో చంద్రబాబు

Chandrababu: జగన్‌ పాలనపై జనాగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది

Vijayanagaram: జగన్‌ ప్రభుత్వం (CM Jagan)పై ప్రజల్లో ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోందని టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయనగరం కోట కూడలిలో చంద్రబాబు రోడ్‌షోకు జనం భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సైకో పాలన పోయి.. సైకిల్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. విధ్వంసం చేయడం సులువని, అభివృద్ధి చాలా కష్టమని చెబుతూనే.. సీఎం పదవి తనకు కొత్త కాదన్నారు. ఏ సీఎం కూడా చేయని ద్రోహం జగన్‌ చేశాడని, అందుకు వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక ధరలు పెంచని వస్తువు, పన్ను వేయని రంగం లేదని పేర్కొన్నారు. పక్కనే నది ఉన్నా విజయనగరం వాసులకు ఇసుక దొరకడం లేదని, అయితే వైసీపీ నేతలు మాత్రం ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.

Updated Date - 2022-12-24T21:13:20+05:30 IST