యువత మానవతా విలువలను పెంపొందించుకోవాలి

ABN , First Publish Date - 2022-02-09T05:34:21+05:30 IST

యువతలో మానవతా విలువలు పెంపొందాలని అప్పుడే సమాజంలో మెరుగైన ఫలితాలు వస్తాయని విజ్ఞాన విద్యాసంస్థల చైర్మన డాక్టర్‌ లావు రత్తయ్య పేర్కొన్నారు.

యువత మానవతా విలువలను పెంపొందించుకోవాలి
జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న డాక్టర్‌ లావు రత్తయ్య

విజ్ఞాన విద్యాసంస్థల చైర్మన డాక్టర్‌ లావు రత్తయ్య

గుంటూరు(విద్య), ఫిబ్రవరి 8 : యువతలో మానవతా విలువలు పెంపొందాలని అప్పుడే సమాజంలో మెరుగైన ఫలితాలు వస్తాయని విజ్ఞాన విద్యాసంస్థల చైర్మన డాక్టర్‌ లావు రత్తయ్య పేర్కొన్నారు. మంగళవారం యంగ్‌ జనరేషన వెల్ఫేర్‌ సోసైటీ సభ్యులు రూ. 11.65 లక్షలు సేకరించి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించిన సందర్భంగా  వడ్లమూడిలోని విజ్ఞాన విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన  లావు రత్తయ్య మాట్లాడుతూ,  కొవిడ్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే అనాధలు, రోడ్డు పక్కన నివసించే వారికి చేయూత ఇవ్వడానికి నిధులు వినియోగించడం అభినందనీయమని తెలిపారు. అదే విధంగా వివిధ రకాల వ్యాధులతో ఇబ్బంది పడేవారికి ఆర్థిక సహాయం అందించారని తెలిపారు.  కార్యక్రమంలో యంగ్‌ జనరేషన వెల్ఫేర్‌ సోసైటీ అధ్యక్ష,కార్యదర్శులు షేక్‌ సాధిక్‌, షేక్‌ సావేజ్‌, ఉపాధ్యక్షుడు శశికిరణ్‌, మెంటార్స్‌ సుష్మ కొణికి, కాటూరి అహిమాంష్‌, లీలా తదితరులు పాల్గొన్నారు. సభ్యులకు డాక్టర్‌ లావు రత్తయ్య ప్రశంసాపత్రాలు అందజేశారు.

Updated Date - 2022-02-09T05:34:21+05:30 IST